
గిరిజన విద్యార్థుల సదువులు అంటే ప్రభుత్వాలకి ఇంత చులకన.... గిరిజన విద్యార్థి సంఘం ఆవేదన ) చింతపల్లి డెక్కన్ న్యూస్ : అల్లూరి జిల్లా చింతపల్లి గిరిజన విద్యార్థి సంఘం ( జి ఎస్ యు ) నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి బూడిదే మాధవరావు, మణుగూరు బాబూజీ, జి ఎస్ యు డివిజన్ అధ్యక్షులు బాబు జీ, చింతపల్లి మండలంలో ఉన్న అనేక పాఠశాలల్లో సందర్శించారు. ఈ సందర్భంగా చింతపల్లి స్థానిక పత్రిక సమావేశంలో బూడిదే మాధవరావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అనేక పాఠశాలలో స్థిరమైన విద్య భవనాలు లేక ఆదివాసీ విద్యార్థులు విద్యకు దూరం అవుతూ ప్రతి సంవత్సరం డ్రాపౌట్ సంఖ్య పెరుగుతుందని మండలంలోగల తమ్మంగుల పంచాయతీ లక్ష్మీపురం ఎంపీపీ పాఠశాలలో సందర్శించగా అక్కడ సుమారు 26 మంది విద్యార్థులు, ఉన్నప్పటికీ ఆ పాఠశాలలో ఉన్న గిరిజన విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు ఇద్దరు ఉపాధ్యాయులను ప్రభుత్వం నియమించింది. శ్రావణి అని ఉపాధ్యాయుడు డ్యూటీ కి వస్తున్నారు కాని సునీత అనే ఉపాధ్యాయురాలు మాత్రం రెండు రోజులుగా డ్యూటీ కి రాకుండా ఒక వాలంటీర్ నీ ఆమె నియమించుకొని పాఠాలు చెప్పిస్తున్నారు. అదే విదంగా గసాయి గొంది ఎంపీపీ పాఠశాల్లో 36 మంది పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ పాఠశాల భవనం యొక్క రేకులు చెడిపోయి వర్షం పడిన ప్రతిసారి నిరుతో నిండిపోతుంది. మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం వంటివి ఏమీ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, కుడుముసారి పంచాయతీ గొప్పుగుడిసే ఎంపీపీ పాఠశాలలో 41 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ అక్కడ సరియైన పాఠశాల భావనము లేక ఒక రేకుల షెడ్ లో పాఠాలు నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు పాఠశాల భవనం మొదటిదశ పిల్లర్ల తోనే ఆగిపోయింది. ఆ పాఠశాలలో సుమారు చుట్టపక్కల 2 గ్రామాల నుంచి వస్తున్న విద్యార్థులు భవనము లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెలమెట్ట ఎంపీపీ స్కూల్ లో 46 మంది విద్యార్థులు ఉన్నారు సుమారు చుట్టుపక్కల 4 గ్రామాల నుంచి వస్తున్నారు. కనీసం కూర్చోవడానికి సరైన పాఠశాల భవనము లేక తాత్కాలిక రేకుల షెడ్ లో పాఠాలు చెప్తున్నారు టీచర్ విధులకు సక్రమంగా హాజరైయ్యి విద్యార్థులకు మంచి పాఠాలు నేర్పిస్తున్నారు కాని పాఠశాల భవనం లేక పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు గిరిజన విద్యార్థి సంఘం నాయకులకు వారి ఆవేదన తెలియజేశారు. వెంటనే అల్లూరి జిల్లా కలెక్టర్ మరియు ఐటీడిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ వారు వెంటనే దృష్టి సాధించి విద్యార్థుల ఉన్నత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్య భవనాలు ఎందు నిమిత్తము ఆగాయో ఇంక్వైరీ చేసి నూతన భవనాలు ఏర్పాటు చేయవలసిందిగా స్థానికులు మరియు గిరిజన విద్యార్థి సంఘం నాయకులు.. లేని పక్షంలో బాధిత గ్రామాల ప్రజలతో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు
Commercial and personal use permitted. No attribution required.
AI Model
Art Style
AI-generated · Free to use under the AI Pics License
See More
గిరిజన విద్యార్థుల సదువులు అంటే ప్రభుత్వాలకి ఇంత చులకన.... గిరిజన విద్యార్థి సంఘం ఆవేదన ) చింతపల్లి డెక్కన్ న్యూస్ : ...
గిరిజన విద్యార్థుల సదువులు అంటే ప్రభుత్వాలకి ఇంత చులకన.... గిరిజన విద్యార్థి సంఘం ఆవేదన ) చింతపల్లి డెక్కన్ న్యూస్ : ...